Takkellapadu, Andhra Pradesh 522438, India

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ నియోజకవర్గం MLA

శ్రీమతి మేరువ విజయలక్ష్మి
గ్రామ సర్పంచ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్

Breaking News

పులుపు ఎక్కువ తింటే ఏమిటి? తక్కువ తింటే ఏమిటి?

పులుపు అంటే అయిష్టత చూపిస్తారు చాలామంది. కొందరికైతే తలుచుకుంటేనే నోరూరుతుంది. ఏదిఏమైనా శరీరంపై మంచి ప్రభావం చూపుతుంది కాబట్టి పులుపు కూడా మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి.
ఈ పులుపు లభించే పదార్థాలు ఏమిటో చూద్దాం. చింత పండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్.

శరీరంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? 
* నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది.
* జీర్ణ క్రియకు సహాయపడుతుంది.
* మల విసర్జన బాగా జరగుతుంది.
* నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటకు పంపుతుంది.
* పదార్థాలకు మంచి రుచినిస్తుంది.
* జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు. 
అధికంగా తీసుకుంటే ఏమవుతుంది? 
* కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి. 
* దృష్టి మందగిస్తుంది. 
* శరీరాన్ని శిథిలపరుస్తుంది.  
* ఆహారాన్ని అధికంగా జీర్ణపరుస్తుంది. 
* కాళ్ళు, చేతులు నీరుపడతాయి. 
* దాహం ఎక్కువ అవుతుంది. 
* ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి. 
కాబట్టి పులుపు తినాలి కానీ మోతాదుకి మించి తినకూడదు... అదీ సంగతి.

No comments